పున్నమి న్యూస్…జర్నలిస్ట్ రమణ: మలికిపురం మండలం చింతలమోరి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ కుమార్ పాల్గొన్నారు. వారు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.


