దెబ్బతిన్న ఇండ్ల నిర్మాణ మరమ్మత్తుల కోసం ప్రతి కుటుంబానికి 50వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి
పనులు లేక పస్తులు తో జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికి నెలకు కావలసిన నిత్యవసర సరుకులను అందివ్వాలి
తుఫాను ప్రభావం వల్ల గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కాళహస్తులు నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల లో నివాసముంటున్న దళిత గిరిజన కాలనీ ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఈరోజు కాళహస్తి మండలం చల్లపాలెం దళిత వాళ్లను ఆయన సందర్శించారు దెబ్బతిన్న ఇండ్లను స్వయంగా పరిశీలించారు
ఈ సందర్భంగా దెబ్బతిన్న రోడ్లు పడిపోయిన ఇండ్లు ఈ అకాల వర్షాల వల్ల పనులు లేక ఉపాధి దొరకక పస్తులతో జీవనం సాగిస్తున్న వారికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొంతమేరకు ఆదుకున్నామని ప్రభుత్వం మరింత ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దెబ్బతిన్న ఇండ్ల నిర్మాణ మరమ్మత్తుల కోసం తక్షణ సాయంగా 50 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అందుకోవాలని కనీసం ఒక నెలకు కావలసిన నిత్యవసర సరుకులను వారికి రేషన్ షాపుల ద్వారా యుద్ధ ప్రాతిపదికన సరుకులు అందివ్వాలని దెబ్బతిన్న రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆ రకంగా పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు
ఇంకా ఈ కార్యక్రమంలోకుడిచేడు చంద్రబాబు కాశీమాల మోహన్ సైదాపల్లి రవి తదితరులు పాల్గొన్నారు
నమస్కారములతో
జనామాల గురవయ్య
కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ
శ్రీకాళహస్తి నియోజకవర్గం సమితి


