చంద్రన్న @30 – మూడు దశాబ్దాల సేవ, సంస్కరణల పయనం
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ —
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తొలిసారి సిఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేక సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గర్వకారణమని
ఆయన పాలనలో రాష్ట్రానికి దిశా నిర్ధేశం జరిగి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది పడింది.ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సంక్షేమ పథకాల విస్తరణ, ఐటీ విప్లవానికి శ్రీకారం, విద్యా–వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం వంటి 30 కీలక పథకాల ద్వారా చంద్రన్న గారు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.
‘జన్మభూమి, దీపం, డ్వాక్రా, ఆదరణ, అన్నా క్యాంటీన్, రైతులకు ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక సాగు, నదుల అనుసంధానం, రియల్ టైం గవర్నెన్స్, అమరావతి రాజధాని’ వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఆయన ముందుచూపుకు నిదర్శనం.
నేటి యువతకు, రాబోయే తరాలకు చంద్రన్న ఒక ప్రేరణాస్ఫూర్తి. ఆయన నాయకత్వం వల్లే తెలుగుదేశం పార్టీ పేదల నుంచి మేధావుల వరకు అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుందని
రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ, ఆచరణలో పెట్టే నాయకుడిగా చంద్రబాబు నిలిచారు. ఆయన 30 ఏళ్ల ప్రజాసేవకు, రాష్ట్ర అభివృద్ధి పయనానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అని నవీన్ తెలిపారు.


