చందర్లపాడు మండలంలో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటును అధిగమిస్తూసంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా చూడడం మనందరి బాధ్యత” అన్నారు.
క్రమశిక్షణతో, సమన్వయంతో పార్టీ శ్రేణులు పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.క్రమశిక్షణతో జరిగిన ఈ కార్యక్రమంలో కోట వీరబాబు, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చందర్లపాడు గ్రామ పార్టీ, బూత్ కన్వీనర్లు ప్రమాణస్వీకారం ఘనంగా
చందర్లపాడు మండలంలో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ కన్వీనర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ, “రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటును అధిగమిస్తూసంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా చూడడం మనందరి బాధ్యత” అన్నారు. క్రమశిక్షణతో, సమన్వయంతో పార్టీ శ్రేణులు పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.క్రమశిక్షణతో జరిగిన ఈ కార్యక్రమంలో కోట వీరబాబు, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

