Saturday, 19 July 2025
  • Home  
  • ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- Featured

ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రెడ్ క్రాస్ ప్రాంగణంలో రక్త దాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు ప్రాంభించి స్వచ్చందంగా రక్తదానము చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ కూడ పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ గత 2 నెలలుగా కొనసాగుతున్న కోవిడ్-19 లాక్ డౌన్ వలన ఏర్పడిన రక్త నిల్వల కొరత వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు, కాన్సర్ పేషెంట్స్ మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొఅంటున్నారు అని అన్నారు. విశ్వవిద్యాలయం తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టటం ద్వారా సుమారు 60 యూనిట్ల రక్తం సేకరించటం గొప్ప ఘనకార్యంగా భావిస్తున్నానని అందుకు సహకరించి ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అయన అభినందించారు. రెడ్ క్రాస్ వారు చేస్తున్న కృషిలో విశ్వవిద్యాలయము కూడా భాగస్వామి అవ్వటం చాలా సంతోషం గా ఉందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో వున్నా దాతలు అందరు ఎటువంటి భయాలు సంశయాలు లేకుండా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు లాక్ డౌన్ సమయం లో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో చేపట్టటం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కృష్ణ చైతన్య కళాశాల NCC మరియు NSS విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారని అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన పరిస్థుతులలో కూడా రక్తం అవసరమైన వారికందరికి అందజేయటం జరిగిందని,ఇటువంటి రక్తదాన శిబిరాల వలన ఇంకా ఎంతోమందికి రెడ్ క్రాస్ సహాయం చేయటానికి తోడ్పడుతుందని అన్నారు. చివరిగా విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కాన్సుల్ మెంబెర్ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ యూనివర్సిటీ జిల్లా అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తుందని ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. వై విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది రవి, మధు భాస్కర్ హెల్ప్ ది నీడి టీం మెంబెర్స్ పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ ప్రాంగణంలో రక్త దాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు ప్రాంభించి స్వచ్చందంగా రక్తదానము చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ కూడ పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ గత 2 నెలలుగా కొనసాగుతున్న కోవిడ్-19 లాక్ డౌన్ వలన ఏర్పడిన రక్త నిల్వల కొరత వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు, కాన్సర్ పేషెంట్స్ మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొఅంటున్నారు అని అన్నారు. విశ్వవిద్యాలయం తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టటం ద్వారా సుమారు 60 యూనిట్ల రక్తం సేకరించటం గొప్ప ఘనకార్యంగా భావిస్తున్నానని అందుకు సహకరించి ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అయన అభినందించారు. రెడ్ క్రాస్ వారు చేస్తున్న కృషిలో విశ్వవిద్యాలయము కూడా భాగస్వామి అవ్వటం చాలా సంతోషం గా ఉందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో వున్నా దాతలు అందరు ఎటువంటి భయాలు సంశయాలు లేకుండా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు లాక్ డౌన్ సమయం లో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో చేపట్టటం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కృష్ణ చైతన్య కళాశాల NCC మరియు NSS విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారని అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన పరిస్థుతులలో కూడా రక్తం అవసరమైన వారికందరికి అందజేయటం జరిగిందని,ఇటువంటి రక్తదాన శిబిరాల వలన ఇంకా ఎంతోమందికి రెడ్ క్రాస్ సహాయం చేయటానికి తోడ్పడుతుందని అన్నారు. చివరిగా విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కాన్సుల్ మెంబెర్ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ యూనివర్సిటీ జిల్లా అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తుందని ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా. వై విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది రవి, మధు భాస్కర్ హెల్ప్ ది నీడి టీం మెంబెర్స్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.