ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం మంగళవారం పలమనేరు ఎలిఫెంట్ హబ్ లో జరిగింది.ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పలమనేరు రూరల్ మండలంలోని మొసలి మడుగు గ్రామ సమీపంలోని ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద అటవీశాఖ అధికారుల ఆద్వర్యంలో ఏనుగులకు ప్రత్యేక పూజాది కార్యక్రమం,ఏనుగుల దినోత్సవం విశిష్టత వంటి కార్యక్రమాలు అధికారులు నిర్వహించారు. ఇక్కడి ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద కర్నాటక నుంచి వచ్చిన కుంకీ ఏనుగులతో పాటు మరో రెండు కలిపి ఆరు ఏనుగులకు ప్రత్యేకoగా పూలను అలంకరించి ఆకర్షనీయంగా మార్చారు.ఇందులో భాగంగా అన్ని ఏనుగులకు విడివిడిగా పూజాధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్,పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి,పలమనేరు రేంజర్ నారాయణ, జిల్లా రైతు సంఘాల నాయకులు ఉమాపతి నాయుడు,వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొని సమావేశంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం విశేషాలు, ఇక్కడ కుంకీ ఏనుగులు క్యాంపు ఏర్పాటు అయిన విధo, ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ అధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం
ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం మంగళవారం పలమనేరు ఎలిఫెంట్ హబ్ లో జరిగింది.ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పలమనేరు రూరల్ మండలంలోని మొసలి మడుగు గ్రామ సమీపంలోని ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద అటవీశాఖ అధికారుల ఆద్వర్యంలో ఏనుగులకు ప్రత్యేక పూజాది కార్యక్రమం,ఏనుగుల దినోత్సవం విశిష్టత వంటి కార్యక్రమాలు అధికారులు నిర్వహించారు. ఇక్కడి ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద కర్నాటక నుంచి వచ్చిన కుంకీ ఏనుగులతో పాటు మరో రెండు కలిపి ఆరు ఏనుగులకు ప్రత్యేకoగా పూలను అలంకరించి ఆకర్షనీయంగా మార్చారు.ఇందులో భాగంగా అన్ని ఏనుగులకు విడివిడిగా పూజాధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్,పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి,పలమనేరు రేంజర్ నారాయణ, జిల్లా రైతు సంఘాల నాయకులు ఉమాపతి నాయుడు,వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొని సమావేశంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం విశేషాలు, ఇక్కడ కుంకీ ఏనుగులు క్యాంపు ఏర్పాటు అయిన విధo, ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ అధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

