విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి 𝐜𝐣𝐰𝐚 యూనియన్ లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క పాత్రికేయునికి క్రాకర్ బాక్స్ మరియు మిఠాయి పంపిణీ విజయవంతంగా నిర్వహించారు నూతనంగా ప్రారంభించిన సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గడిచిన ఆరు నెలల్లోనే తారస్థాయికి చేరుకున్నాది అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.. అని కొంతమంది జర్నలిస్టు మిత్రులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా గతంలో విజయవంతంగా జరిపించిన దసరా సంబరాలు మరియు దీపావళి పండుగని పురస్కరించుకుని జరిపించిన దీపావళి ఉత్సవాలు వారిలో ఎంతో ఆనందాన్ని కలగజేశాయని కొంతమంది జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కంచర్ల మీడియా సీఈఓ శంకర్రావు,ఆనందరావు సిటీ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ .అధ్యక్షులు ఆల్ఫా కృష్ణ .ఉప అధ్యక్షులు రేగిడి రూప గుణ శేఖర్.. సెక్రటరీ కందుకూరి మహాలక్ష్మి పి ఆర్ ఓ మామిడి రవికుమార్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.. ఈ యొక్క కార్యక్రమానికి కొంతమేరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ సినీ నిర్మాత డైరెక్టర్ మరియు వ్యాపారవేత్త. మనసులో మాట పత్రిక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి కంచర్ల అచ్యుతరావు కి .యూనియన్ తరపున సభ్యులు అందరి తరపున అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ మరియు రేగిడి గుణశేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు.


