శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ 21 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.


