పలమనేర్ లో ఆడికృత్తిక మరియు కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలమనేరు శాసనసభ్యుల అమరనాథ రెడ్డి స్థానిక టిడిపి నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలలో పాల్గొని స్వామివారిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు విరివిగా కురిసి రైతులు మంచి పంటలను పండించాలని అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఇక ఆలయం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు RBC కుట్టీ, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, శ్రీధర్, ఖాజా, నాగరాజు,అమరనాథ రెడ్డి, మదన్, రూపేష్, జగదీష్, హరీష్, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

ఘనంగా ఆడికృత్తిక, కృష్ణాష్టమి వేడుకలు – పాల్గొన్న ఎమ్మెల్యే
పలమనేర్ లో ఆడికృత్తిక మరియు కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలమనేరు శాసనసభ్యుల అమరనాథ రెడ్డి స్థానిక టిడిపి నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలలో పాల్గొని స్వామివారిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు విరివిగా కురిసి రైతులు మంచి పంటలను పండించాలని అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఇక ఆలయం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు RBC కుట్టీ, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, శ్రీధర్, ఖాజా, నాగరాజు,అమరనాథ రెడ్డి, మదన్, రూపేష్, జగదీష్, హరీష్, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

