ఘనంగా అగనంపూడి ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం…
అగనంపూడి, జనవరి 28, పున్నమి ప్రతినిధి.
వాహన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయం ఆర్టీవో వి జయప్రకాష్
అగనంపూడి ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా అగనంపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఆర్టీవో చేత చేయించి అనంతరం ఆర్టీవో కి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స కి ఆఫీస్ స్టాప్ కి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఆర్టీవో వి జయ ప్రకాష్ మాట్లాడుతూ అగనంపూడి ఆర్టీవో కార్యాలయం ప్రారంభం నాటి నుండి నేటి వరకు 1 లక్ష 23 వేల 150 వెహికల్స్ కి వివిధ రకాల సేవలు అందించడం జరిగిందని, వాహనదారులు కు మెరుగైన సేవలు అందించడమే మా ధ్యేయం అని మనీ, రవాణా శాఖ నిబంధనలు అనుసరించాలని కోరారు. ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్, బీహెచ్ఈఎల్, గంగవరం పోర్ట్, విఈపిజెడ్, ఆటోనగర్ ప్రాంతంలో వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులకు సౌలభ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అగనంపూడిలో ఆర్టీవో కార్యాలయం 38 లక్షల ప్రభుత్వ నిధులతో కట్టించడం జరిగినదనీ, ఇటీవల గాజువాక, గంభీరం ఆర్టీవో కార్యాలయాల లో ఆటోలు దగ్గర నుండి భారీ వాహనాల వరకు వాహనలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ 2025 డిసెంబరు 2 నుండి నిలుపుదల చేసి సబ్బవరం కి మార్చారనీ, పల్లా శ్రీనివాసరావు యుద్ధ ప్రాతిక మీద జిల్లా కలెక్టర్, ఆర్టీవో అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి అగనంపూడి, గంభీరంలో పాత పద్ధతిలోనే ఎఫ్సీలు అయ్యే విధంగా కృషి చేయడం జరిగిందని వాహనదారుల తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
పీకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ మాట్లాడుతూ ఆర్టీవో అధికారులు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయడంతో స్కూల్ బస్సులు ట్రావెల్స్ ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారని అదే విధంగా విశాఖపట్నం జిల్లాలో వాహనాలు రద్దీకి అనుకూలంగా రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. అగనంపూడి లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కరాజు గోవిందరాజు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక స్టీల్ సిటీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు కొర్రాయి నాగార్జున, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స డిపి రంగారావు, ఎన్ శ్రీనివాస్, జి సత్యం నాయుడు, వై లలిత, జి సృజన ఆఫీస్ స్టాఫ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విందుల నర్సింగరావు (అందరివాడు) ముమ్మని అప్పారావు, ఎం శ్రీను, గొన్న తాతారావు, బొబ్బరి ప్రవీణ్ కుమార్, గోపిశెట్టి సత్య రావు, గొన్న గోపి, సలాది శ్రీనివాస, పినబాల మహేష్ తదితరులు పాల్గొనారు.


