*ఘణంగా విశాఖ బీచ్ రోడ్డులో యూనిటీ రన్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో మైభారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ , నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జెండా ఊపి ఐక్యతా రన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్ఫూర్తి అని అన్నారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుండి వైయంసిఏ వరకు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ యూనిటీ రన్ చేసారు. కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి సుజాత,టిడిపి జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ,కూటమి నాయకులు సిరసపల్లి నూకరాజు, దానేష్, శంకరరావు, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


