Wednesday, 25 March 2026
  • Home  
  • గ్రామ దేవతల కుంభాభిషేక మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

గ్రామ దేవతల కుంభాభిషేక మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ దేవతలు శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు కుంభాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకను భక్తులు కనులారా వీక్షించారు.ఈ కుంభాభిషేక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా విచ్చేశారు. యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంగాలపల్లి తులసీరామిరెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో పండితులు ఆశీర్వచనం అందించగా, చైర్మన్ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటి అద్యక్షులు రంగినేని చెంచయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ రెడ్డి, రామిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ దేవతలు శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు కుంభాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకను భక్తులు కనులారా వీక్షించారు.ఈ కుంభాభిషేక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా విచ్చేశారు. యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంగాలపల్లి తులసీరామిరెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో పండితులు ఆశీర్వచనం అందించగా, చైర్మన్ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటి అద్యక్షులు రంగినేని చెంచయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీలకంఠ రెడ్డి, రామిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.