-ఖాదీ గ్రామోద్యోగ్పై స్పెషల్ సీఎస్ సిసోడియా దృష్టి – సీబీఎన్ విజన్ గ్రూప్స్పై చర్చ
చిట్వేల్, నవంబర్ 21 పున్నమి ప్రతినిధి
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి, ఉద్యోగాల కల్పన కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ఆర్.పి. సిసోడియా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.మంగళగిరి, ఎర్రబాలెంలో ఉన్న ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ (కేజీఎంవీ)కార్యాలయంలో ఏపీ ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కె.కె. చౌదరి కలిసి ఆయన ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.
-ముఖ్యాంశాలపై సమీక్ష
గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో పలు ముఖ్యాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ప్రధానంగా కింది అంశాలపై సమీక్ష జరిగింది స్వయం ఉపాధి కల్పన గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు.
సబ్సిడీ రుణాలు గ్రామీణ పరిశ్రమల కోసం అందించే సబ్సిడీ రుణాలు, లబ్ధిదారులకు వాటిని మరింత వేగంగా చేరవేయడంపై చర్చ.పీఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అమలు తీరు, లక్ష్యాల సాధనపై సమీక్ష.సీబీఎన్ విజన్ గ్రూప్స్ ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయం (కేజీఎంవీ) ద్వారా నూతనంగా ప్రారంభించబోతున్న సీబీఎన్ విజన్ గ్రూప్స్ యొక్క కార్యక్రమాలపై, వాటి అమలు వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించారు.
-అధికారుల భాగస్వామ్యం
ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ సిసోడియా పాటు ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈవో కట్టా సింహాచలం (ఐఏఎస్) పాల్గొన్నారు. అలాగే, ఏపీ ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ (కేజీఎంవీ) ప్రిన్సిపాల్ మరియు ఎఫ్ఏ&సీఏఓ రవి కుమార్, డిప్యూటీ డైరెక్టర్ వి. రమేష్ బాబుమరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని క్షేత్రస్థాయి నివేదికలను సమర్పించారు. గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అధికారులు చైర్మన్కు హామీ ఇచ్చారు.


