గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల సమీకరణలో ప్రగతిని సాధించి ఆర్థికంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని చిట్వేలు మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు చిట్వేలు మండల పరిషత్ కార్యాలయం నందు రెండు రోజులు గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంపుపై శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీలలో సర్పంచులతో కలిసి గ్రామ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు సంబంధిత సిబ్బంది పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సర్పంచులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఈ కార్యక్రమంలో కౌశలం సర్వే కి సంబంధించి సాంకేతిక పరికరాలు, టెలిఫోన్ చిట్వేలు మండలంలోని గ్రామ సచివాలయాల కార్యదర్శులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పంపిణీ చేశారు. కౌశలం సర్వేని గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు.

గ్రామపంచాయతీలు సొంత ఆదాయ వనరులను సమీకరించుకోవాలి
గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల సమీకరణలో ప్రగతిని సాధించి ఆర్థికంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని చిట్వేలు మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు చిట్వేలు మండల పరిషత్ కార్యాలయం నందు రెండు రోజులు గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంపుపై శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీలలో సర్పంచులతో కలిసి గ్రామ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు సంబంధిత సిబ్బంది పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సర్పంచులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఈ కార్యక్రమంలో కౌశలం సర్వే కి సంబంధించి సాంకేతిక పరికరాలు, టెలిఫోన్ చిట్వేలు మండలంలోని గ్రామ సచివాలయాల కార్యదర్శులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పంపిణీ చేశారు. కౌశలం సర్వేని గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు.

