అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలంలోని గొల్లపల్లి పంచాయతీలో పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ పి. సునీలత ఆదేశాల మేరకు చేజర్ల సెక్టార్ సూపర్వైజర్ ఎం.పద్మ సూచనలు సలహాలు మేరకు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. అలాగే చక్కెర, నూనె లేని ఆహారం తీసుకోవాలని ఆకుకూరలు, మునగాకు యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు బి.విజయ కుమారి, పి.పద్మ, పోలమ్మ,తిరుపతమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


