శ్రీ సాయి సత్సంగం నిలయం కోటా సునీల్ కుమార్, జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, రుద్ర హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హోమం, ఆయుష్షు హోమం, దుర్గా త్రిశతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణ రెడ్డి హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల కోసం విక్రమసింహపురి యూనివర్సిటీ లో అందిస్తున్న కోర్సులను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నాగరాజు, పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 110 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులను విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కృష్ణా రెడ్డి అందజేశారు.. ఈ సందర్భంగా సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఇస్తున్న సబ్సిడీ పోను మిగిలిన ఫీజును తాను అందజేస్తామని ప్రకటించారు.
గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం
శ్రీ సాయి సత్సంగం నిలయం కోటా సునీల్ కుమార్, జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, రుద్ర హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హోమం, ఆయుష్షు హోమం, దుర్గా త్రిశతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణ రెడ్డి హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల కోసం విక్రమసింహపురి యూనివర్సిటీ లో అందిస్తున్న కోర్సులను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నాగరాజు, పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 110 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులను విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కృష్ణా రెడ్డి అందజేశారు.. ఈ సందర్భంగా సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఇస్తున్న సబ్సిడీ పోను మిగిలిన ఫీజును తాను అందజేస్తామని ప్రకటించారు.