ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి ) మనుబోలుమండలం గురువిందపూడి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జల్జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, సిసి రోడ్డును ప్రారంభించారు. రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన చేశారు. గ్రామ హైస్కూల్కు స్థలం కొరత ఉండటంతో పక్కనున్న భూమిని కొనుగోలు చేసి అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. నిధుల లేమితో ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ రహదారుల మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

గురువిందపూడిలో అభివృద్ధి పనులకు శ్రీకారం – హైస్కూల్కు కొత్త గదుల నిర్మాణానికి హామీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి ) మనుబోలుమండలం గురువిందపూడి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జల్జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, సిసి రోడ్డును ప్రారంభించారు. రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన చేశారు. గ్రామ హైస్కూల్కు స్థలం కొరత ఉండటంతో పక్కనున్న భూమిని కొనుగోలు చేసి అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. నిధుల లేమితో ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ రహదారుల మరమ్మత్తులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

