Saturday, 14 February 2026
  • Home  
  • గుడిమల్లం పరశురామేశ్వరునికి ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ
- తిరుపతి

గుడిమల్లం పరశురామేశ్వరునికి ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా శనివారంనాడు ఏర్పేడు మండలం గుడిమల్లంలోని చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామి వారి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ పవిత్ర ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్ర విశిష్టతను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వసతి సౌకర్యాల మెరుగుదలగు వాటిపై నిధుల కేటాయింపులపై ఆలయ జీర్ణోద్ధరణకు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన నిధుల మంజూరుపై పర్యాటక ప్రాముఖ్యత: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేవాలయాల పరిరక్షణకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు, జిల్లా యస్. పి., పలుప్రభుత్వ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా శనివారంనాడు ఏర్పేడు మండలం గుడిమల్లంలోని చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామి వారి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ పవిత్ర ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్ర విశిష్టతను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వసతి సౌకర్యాల మెరుగుదలగు వాటిపై నిధుల కేటాయింపులపై ఆలయ జీర్ణోద్ధరణకు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన నిధుల మంజూరుపై పర్యాటక ప్రాముఖ్యత: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేవాలయాల పరిరక్షణకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు, జిల్లా యస్. పి., పలుప్రభుత్వ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.