ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. పెంచలకోనలోని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అధినేతలు విజయ్ భరత్, విజయ్ గోకుల్, విజయ్ సౌమ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కోరిక మేరకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆశ్రమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

గుడిమల్లంలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ
ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. పెంచలకోనలోని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అధినేతలు విజయ్ భరత్, విజయ్ గోకుల్, విజయ్ సౌమ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కోరిక మేరకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆశ్రమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

