ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన సేవా కార్యక్రమం ఇటీవల జరిగింది. గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్ వెళ్ళే రహదారి ఇటీవల వర్షాకాలంలో భారీ వర్షాల వలన గుంతలమయమై, రవాణాకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దానిని గమనించిన గ్రామ మాజీ సర్పంచ్ సెండే దత్తు గారు వెంటనే స్పందించారు.తన సొంత ఖర్చుతో రోడ్డుపై మొరం మట్టి వేయించి, గుంతలను నింపించి చదును చేయించారు. గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని సెండే దత్తు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుసుల్ల సత్తయ్య, తిరుసుల్ల భీమ్ రావు, ఆరెందుల సంతోష్, గ్రామస్థులు రాస్పెళ్లి సుభాష్, దాన్పెల్లి సంతోష్, ఆటో డ్రైవర్లు సాయికృష్ణ, దిలీప్, మోండయ్య, అంజయ్య, పవన్, మహేష్, వినోద్, జాబరి రాజు, పెరుగు రవి తదితరులు పాల్గొన్నారు.

గుంతల రోడ్డును సరిచేసిన గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు
ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన సేవా కార్యక్రమం ఇటీవల జరిగింది. గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్ వెళ్ళే రహదారి ఇటీవల వర్షాకాలంలో భారీ వర్షాల వలన గుంతలమయమై, రవాణాకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దానిని గమనించిన గ్రామ మాజీ సర్పంచ్ సెండే దత్తు గారు వెంటనే స్పందించారు.తన సొంత ఖర్చుతో రోడ్డుపై మొరం మట్టి వేయించి, గుంతలను నింపించి చదును చేయించారు. గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని సెండే దత్తు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుసుల్ల సత్తయ్య, తిరుసుల్ల భీమ్ రావు, ఆరెందుల సంతోష్, గ్రామస్థులు రాస్పెళ్లి సుభాష్, దాన్పెల్లి సంతోష్, ఆటో డ్రైవర్లు సాయికృష్ణ, దిలీప్, మోండయ్య, అంజయ్య, పవన్, మహేష్, వినోద్, జాబరి రాజు, పెరుగు రవి తదితరులు పాల్గొన్నారు.

