Tuesday, 24 March 2026
  • Home  
  • గుండెపోటు వచ్చిన భక్తుడిని కాపాడిన తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్
- తిరుపతి

గుండెపోటు వచ్చిన భక్తుడిని కాపాడిన తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిన భక్తుడిని సకాలంలో కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. వివరాల్లోకెళితే ఆగస్టు 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలం, మామిడిపల్లి గ్రామస్తుడు మేడం శ్రీనివాసులు( 61) తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శన అనంతరం రాత్రి 9:30 గంటలకు లడ్డు ప్రసాదాలు తీసుకొని, లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతుండగా పడమర మాడా వీధిలో అకస్మాత్తుగా సదరు శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే భక్తుడి వద్దకు చేరుకొని సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిర్ చేసి భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం భక్తుడిని తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం పంపడం జరిగినది. సిమ్స్ ఆస్పత్రిలో భక్తుడు మెరుగైన చికిత్స పొందినందున ప్రాణాలతో బ్రతికి బయట పడడం, డ్యూటీ డాక్టర్లు అతనిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి పంపడం జరిగినది. ఈ సంఘటన పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో భక్తుడిని కాపాడినందున భక్తులు మరియు అధికారులు సదరు కానిస్టేబుల్ గుర్రప్పను అభినందించినారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిన భక్తుడిని సకాలంలో కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. వివరాల్లోకెళితే ఆగస్టు 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలం, మామిడిపల్లి గ్రామస్తుడు మేడం శ్రీనివాసులు( 61) తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శన అనంతరం రాత్రి 9:30 గంటలకు లడ్డు ప్రసాదాలు తీసుకొని, లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతుండగా పడమర మాడా వీధిలో అకస్మాత్తుగా సదరు శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే భక్తుడి వద్దకు చేరుకొని సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిర్ చేసి భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం భక్తుడిని తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం పంపడం జరిగినది. సిమ్స్ ఆస్పత్రిలో భక్తుడు మెరుగైన చికిత్స పొందినందున ప్రాణాలతో బ్రతికి బయట పడడం, డ్యూటీ డాక్టర్లు అతనిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి పంపడం జరిగినది. ఈ సంఘటన పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో భక్తుడిని కాపాడినందున భక్తులు మరియు అధికారులు సదరు కానిస్టేబుల్ గుర్రప్పను అభినందించినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.