అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 5( పున్నమి ప్రతినిధి అవినాష్ రెడ్డి)
వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్, చెన్నై వారి ఆహ్వానం మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో నందలూరు మండలంలోfcని విస్డం స్కూల్ కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది , చెన్నైలోని SIVET College, సెంబాకం నందు జరిగినది, ఈ కార్యక్రమం నాకు దేశం నలుమూలల నుంచి 1500 మంది కరాటే విద్యార్థులు పాల్గొనడం జరిగింది, విస్డం స్కూల్ నుండి వి. మనోజ్ఞ సాయి, బి. నివేదిత, ఎస్. మోక్షిత్,వి. నిర్వాన్ నందన్, ఎస్. సమీనా, ఎస్. తసీఫా, ఎస్. సాదిక్, ఎస్. మౌలా, నిత్యశ్రీ మరియు గోపీచంద్ పాల్గొన్నారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తరుపున Mr రిషి నాథ్ Adjudicator వారి ముందు కరాటే విద్యను ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత రిషి నాథ్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నందు ఈవెంట్ ని నమోదు చేసి వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందజేయడం జరిగింది మరియు పాల్గొన్న విద్యార్థులకు పథకాలని మరియు సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది, మండలంలోని కరాటే మాస్టర్ సుధాకర్ ఈ కార్యక్రమానికి విద్యార్థిని తీసుకొని వెళ్లడం జరిగింది వారి అద్భుత ప్రదర్శన ద్వారా వారు ఈ అచీవ్మెంట్ ని సాధించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు మరియు విస్డం స్కూల్ కరస్పాండెంట్ వలిమి రాధ పిల్లల్ని అభినందించి హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
ఫోటో రైట్ అప్ : మాస్టర్ వలిమి సుధాకర్. నందలూరు

