
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవంను గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనజ్ మెంట్ కళాశాలలోని జాతీయ సేవా పధకం రెండు విభాగాలు ఘనంగా నిర్వహించాయి.
ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులలో స్ఫూర్తి కోసం మహాత్ముల చరిత్రలు చదవాలని, సర్దార్ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో ఐక్యతకు అడుగులువేశారని, పటేల్ జీవితాన్ని అందరూ తెలుసుకోవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే విజయాల శాతం, శతశాతమన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి సమన్వయకర్త డా. మార్తాoడ కృష్ణ, అప్పలనాయుడు, గోపాలరావు, హరిరామ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

