అమరావతి జనవరి (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదిత్యంతో విజయవాడ లోని లోక్ భవన్ నందు సోమవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువతకు ఉపయోగపడే ఎన్నో స్ఫూర్తి దయాకమైన సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, యువ రచయిత కె.మురళీమోహన్ రాజు గవర్నర్ తేనేటి విందులో పాల్గొన్నారు. ఈసందర్భంగా మురళీమోహన్ రాజును పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.



