ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @భద్రత చర్యలు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బి వి కృష్ణా రావు ఐ పి ఎస్ వారి ఆదేశాలు మేరకు కొత్తపేట సబ్ డివిసినల్ పోలీస్ ఆఫీసు ఎస్ మురళి మోహన్ వినాయక చవతి సందర్భంగా గణేష్ మండపాల వద్ద భద్రత చర్యలు మరియు నిమజ్జన సమయం లో పాటించవలసిన నిబందనలు గురించి పలు సూచనలు చేశారు.
వర్షాలు మరియు వరదలు కారణంగా చెరువులు, గోదావరి నది ప్రవహాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్జన సమయంలో భక్తులు జారి పడే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నిమజ్జన ప్రదేశాలలో ప్రభుత్వ అధికారుల సూచనలు విధిగా పాటించవలెను, నిమజ్జన ప్రదేశాలకు చిన్న పిల్లలు మరియు మహిళలు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలెను.
ఉత్సవ కమిటి వారు ముందుగా తీసుకున్న అనుమతుల ప్రకారం, తెలియపర్చిన సమయం ప్రకారం చెప్పిన ప్రదేశాలలో మాత్రమే నిమజ్జనం చేయాలి.
పోలీస్ వారికి సమాచారం తెలపకుండా నిమజ్జన ఊరేగింపు ఎట్టి పరిస్థితిలోనూ జరపరాదు. అదేవిధంగా నిమజ్జన ఊరేగింపు ముందు చెప్పిన మార్గము మరియు పోలీస్ వారు నిర్ణయించిన రూటు నందు మాత్రమే వెల్లవలెను.
మద్యం గాని మరి ఏవిదమైన మత్తు పానీయాలు గాని సేవించి నిమజ్జన ఊరేగింపు నందు పాల్గొనరాదు, అట్టివారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.
నిమజ్జన ఊరేగింపు లో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు పడకూడదు. సంయమనం పాటించి పోలీస్ వారి సూచనలు సలహాలు తప్పక పాటించవలెను.
ఊరేగింపు సమయం లో ట్రాఫిక్ నియంత్రణకు తగిన వలంటీర్లను ఉత్సవ కమిటి నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవలెను. అదేవిధంగా ఉత్సవ కమిటి నిర్వాహకులు మరియు వలంటీర్లు విధిగా గుర్తుంపు కార్ద్ లు ధరించవలెను.
వినాయక మండపాల వద్ద మరియు ఊరేగింపులలోను పెద్ద పెద్ద సౌండ్స్ చేసే డి జె సౌండ్స్ సిస్టమ్స్ ఉపయోగించుట నిషేదించడ మైనయిది.
ఊరేగింపులో మంచి కండిషన్ లో ఉన్న వాహనాలు మాత్రమే ఉత్సవ కమిటి వారు ఉపయోగించ వలెను. మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించడం, . మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసి నడపడం పూర్తిగా నిషేదించడ మైనయిది.
నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల కేబిన్ల పై ఎవరు కూర్చోకుండా ఉత్సవ కమిటి వారు ప్రతికే శ్రద్ధ తీసుకో వలెను. అదేవిధంగా ఎటువంటి అసభ్య మరియు అశ్లీల వేశధారణలు వేయరాదు
వినాయక మండపాలు వద్ద విద్యుత్ తీగలు వర్షాలు కారణంగా వేలాడుతూ ఉంటే స్థానిక విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి స్వంత నిర్ణయాలతో మీ ప్రాణాలు ఫణంగా పెట్టవద్దు.
సబ్ డివిజన్ లో ఈ వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జన కార్యక్రమాల లో ఎటువంటి అవాంఛనీయ సంగటనలకు తావు లేకుండా ప్రజలు అందరూ ప్రశాంత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని సబ్ సబ్ డివిజన్ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి
నిబంధనలు అతిక్రమించిన ఎడల పోలీస్ వారు తీసుకును చర్యలకు ఉత్సవ కమిటి సభ్యులు బాధ్యులు అవుతారు మరియు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును.
ఇట్లు
ఎస్ మురళి మోహన్. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్
కొత్తపేట


