పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్30)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో వేంచేసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ ట్రస్టీ చైర్మన్ సుంకవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మొదలు కొని దాతల సహకారంతో ప్రతీరోజూ సుమారు 400 మందికి అన్నసంతర్పణ చేస్తున్నారు, ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిచెందారు,కోర్కెలు తీరిన భక్తులు మ్రొక్కుబడులు తీర్చుకొనేందుకు ఆదివారం, మంగళవారాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారని,ఈ ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు.


