అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :
అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం : అచ్యుత జూనియర్ కళాశాల, అచ్యుతపురం విద్యార్థిని బి. మేఘనా బ్లెస్సీ, మరియు బి లయా జెస్షిక లు ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సబ్బవరం లో నిర్వహించబడిన పోటీలలో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించి కళాశాలకు గౌరవాన్ని తెచ్చిపెట్టారు.
విద్యార్థినులు అద్భుత ప్రదర్శనను గుర్తిస్తూ డీఈఓ అనకాపల్లి మద్దిలి వినోద్ బాబు, కరస్పాండెంట్ పల్లి శేషగిరి రావు, మరియు ప్రిన్సిపాల్ రాజన సత్యనారాయణ, మేఘనా బ్లెస్సీని, లయా జెస్షికలను, అభినందించారు.
వీరువురి విజయంతో ప్రేరణ పొందిన విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించాలని వారు ఆకాంక్షించారు.
కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థినులు మేఘనా బ్లెస్సీకి మరియు లయా జెస్షిక లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


