ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు
గురువారం నాడు సత్తుపల్లి శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగామయి తో కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులని పరిశీలించి న అనంతరం సమావేశం లో మాట్లాడుతూ..
హైవే ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోంది. రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద హైవే పనులను, ఎంట్రీ–ఎగ్జిట్ ప్రాంతాలను ఎమ్మెల్యేలు మట్టా రాగమయి గారు, రాం దాస్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, NHAI అధికారులు, స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగిందని తెలియజేసారు.
భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే ఇచ్చిన ధరకు అదనంగా రైతుల డిమాండ్ ప్రకారం 12 శాతం నష్టపరిహారం చెల్లించాలని NHAI అధికారులను ఆదేశించామని అన్నారు
హైవే నిర్మాణంలో ముక్కలుగా మిగిలిన రైతు భూములకు కూడా నష్టపరిహారం అందించేలా చూస్తామన్నారు
రైతుల సాగుకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్లను నిర్మించాలని, అవసరమైన మేర డ్రెయిన్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలియజేసారు.


