ఖమ్మం పున్నమి ప్రతినిధి
(పువ్వాడ నాగేంద్ర కుమార్)
ఖమ్మం నగరం
2024 -25 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. వీరిలో అదనపు DCP ప్రసాద్ రావు, పట్టణ ACP రమణ మూర్తి, CCRB ACP సాంబరాజు, పోలీస్ సిబ్బంది వున్నారు. మహోన్నత సేవ పతకం (01) ఉత్తమ సేవ పతకం (05) సేవ పతకం (64) ఉత్కృష్ట పతకాలు (12) సాధించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 82 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో AR ACP నర్సయ్య, RI కామరాజు పాల్గొన్నారు.


