ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన ఎస్ ఐ ఆర్ & బి ఎల్ఏ. 2.సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రతి డివిజన్ నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించి, వారి పూర్తి వివరాలను జిల్లా పార్టీకి సమర్పించాలని సూచించారు. అలాగే బూత్ స్థాయి ఓటర్ లిస్టు వెరిఫికేషన్, చేర్పులు-మార్పులు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని నాయకత్వం ఆదేశించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, ఈశ్వర ప్రగడ రామారావు, నక్క రవి గౌడ్, తాజానూత భద్రం, పాశం శ్రీనివాసరెడ్డి, ఇనుగుర్తి ఉపేంద్ర, భూపతి రాజు రామాచారి తదితరులు పాల్గొన్నారు.



