పున్నమి ప్రతినిధి
ఖమ్మం
ఖమ్మం జిల్లా పరిధిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడుతారో అనే ప్రశ్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుల్లో ఉంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కి జిల్లా లో ఉన్న 5నియోజక వర్గాల్లో పార్టీ యొక్క శాసన సభ్యులు ఉన్నారు. కాబట్టి జిల్లా లో తామే విజయం సాధిస్తామని అధికార కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ కి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వస్తున్నాయి అని వాటి వల్ల నే గ్రామ పంచాయతీ లు అభివృద్ధి చెందాయ్ అని కాబట్టి బీజేపీ కే పట్టం కడుతారు అని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. మేము అధికారం లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ని ప్రజలు మాకే పట్టం కడుతారని బి ఆర్ ఎస్ నాయకులు చెప్పుకున్నారు.మేము ఏ పార్టీ కి మద్దత్తు ఇస్తే ఆ పార్టీ విజయం ఖాయం అని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చాము కనుక నే కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి ని తెలుగు దేశం పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ లు అంటున్నారు. బీజేపీ జనసేన తెలుగు దేశం కూటమి ఏర్పాటు అవుతుంద, కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ కూటమి ఏర్పాటు అవుతుంద.. అనే అనుమానం కూడా లేక పోలేదు. ఏది ఎం అయినా ప్రజలు ఎవరికి పట్టం కడుతారు అనే సందేహం కి తెరపడాలి అంటే కొంచం సమయం వేచి చూడాల్సిందే.

