ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్ హైదరాబాద్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు శ్యామ్ సుందర్ నాయక్ తెలిపారు.



