ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..


