సిద్దవటం,సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి)
సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామ సమీపం లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజయ్య స్వామి కోనలోనలోని పంచలింగాల గుడి సమీపాన ఉన్న కోనేరులో సోమవారం దేవాదాయ శాఖ సిబ్బంది చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేశారు.కోనకు వచ్చే భక్తులకు దాహం తీర్చేందుకు ఈ కోనేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలయ ఈవో శ్రీధర్ పర్యవేక్షణలో నీటి గుండం శుభ్రం చేశారు.


