అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రిల్లింగ్ ప్రాంతం నుంచి గ్యాస్ పైకి చిమ్ముతూ మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ONGC సాంకేతిక నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Uploaded Video:



