Saturday, 19 July 2025
  • Home  
  • కోటి రూపాయలతో నిర్మించేందుకు తలపెట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కాకాణి.
- Featured

కోటి రూపాయలతో నిర్మించేందుకు తలపెట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కాకాణి.

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను అవసరం మేరకు సడలింపులు ప్రకటించిన నేపధ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడింది.లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ఉపాధి పనులు, ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడం జరుగుతుంది.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశాం. నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రతి కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన ముందస్తు చర్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా. మంజూరైన నిధులను గ్రామంలో ఉన్న వారందరూ ఒక్క తాటిపై ఉంటూ అవసరమైన చోట వినియోగించుకోవాలి.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతాం.అర్హులైన వారి పేర్లు ఎవరివైన జాబితాలో లేకపోతే విచారణ జరిపించి, న్యాయం చేస్తాం.ఇళ్ల స్థలాలు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇళ్ల పట్టాలు అందచేసే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు.ఉచిత రేషన్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా “సర్వేపల్లి రైతన్న కానుక” పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష పైచిలుకు కుటుంబాలకు బియ్యం, వంటనూనె పంపిణీ చేయడం జరిగింది. శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను అని తెలిపారు

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను అవసరం మేరకు సడలింపులు ప్రకటించిన నేపధ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడింది.లాక్ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ఉపాధి పనులు, ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడం జరుగుతుంది.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశాం. నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రతి కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన ముందస్తు చర్యలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా. మంజూరైన నిధులను గ్రామంలో ఉన్న వారందరూ ఒక్క తాటిపై ఉంటూ అవసరమైన చోట వినియోగించుకోవాలి.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతాం.అర్హులైన వారి పేర్లు ఎవరివైన జాబితాలో లేకపోతే విచారణ జరిపించి, న్యాయం చేస్తాం.ఇళ్ల స్థలాలు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇళ్ల పట్టాలు అందచేసే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు.ఉచిత రేషన్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా “సర్వేపల్లి రైతన్న కానుక” పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష పైచిలుకు కుటుంబాలకు బియ్యం, వంటనూనె పంపిణీ చేయడం జరిగింది. శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.