శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మన్నెమాల భాస్కర్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హరిజనవాడ కాలనీలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మన్నెమాల భాస్కర్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం చేశారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, టేబుల్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



