పున్నమి ప్రతినిధి:
*కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥
*ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?*
*మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ దండెం రాంరెడ్డి
మీడియా సమావేశంలో దండెం రాంరెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? అనేది ప్రజలకు అర్ధం కావడం లేదు అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉంది అన్నారు, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను తెచ్చి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపారు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ని జీహెచ్ఎంసీ లో కలపడం వలన ఆయా గ్రామాల ప్రజల మీద తీవ్ర టాక్స్ భారం పడుతుంది, అందువలన ఏం అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు, ఎల్బీనగర్ జోన్ లో ఉన్న పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ లను నాగోల్ సర్కిల్ లో కాకుండా పక్కనే ఆనుకొని ఉన్న హయాత్నగర్ సర్కిల్ లో ఈ డివిజన్ల ను కలపాలి అని అన్నారు,
పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల లోని ఓటర్ల వ్యత్యాసం, పెద్ద అంబర్ పేట్ డివిజన్ లో 55 వేలకు పైచిలుకు, కుంట్లూరు డివిజన్ లో 12 వేల పైచిలుకు ఓటరు వ్యత్యాసం ఉంది అన్నారు, అదేవిధంగా కుంట్లూరు రెవెన్యూ ఏ లేదు దానిని ఒక డివిజన్ గా చేశారు అన్నారు, కుంట్లూరు తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ గా చేయాలని తెలిపారు, ఈ విషయమై కమిషనర్ గారికి మెమోరాండం కూడా అందజేయడం జరిగింది అన్నారు, రంగారెడ్డి జిల్లా లోనే సీనియర్ శాసన సభ్యుడిని అని చెప్పుకునే మన ఎమ్మెల్యే కి ఈ మాత్రం అవగాహన లేదా అని ప్రశ్నించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న అన్ని డివిజన్ల లో లోపాలు సరిచేసి అన్ని డివిజన్లు సరిసమానంగా ఏర్పాటు చేయాలని అన్నారు, దీని మీద స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగా తేల్చుకుంటాం అన్నారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ అర్చన దామోదర్, తాజా మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేసారం బాలకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ పిల్లి నగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}


