అనంతసాగరం మండలం ఏప్రిల్ 30 (పున్నమి విలేఖరి): రేవూరు గ్రామం నందు శుక్రవారం సాయంత్రం తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో రేణంగి వెంకటసుబ్బయ్య ( 55) మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణంగి వెంకట సుబ్బయ్య మద్యం మత్తులో పొలం చదును చేసే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండడంతోవెంకటసుబ్బయ్య కుమారుడు రేలంగి ప్రవీణ్ తండ్రికి ఎంత చెప్పినా వినకుండా దాడికి దిగడంతో కత్తిపీట తో దాడి చేయగా వెంకటసుబ్బయ్య తీవ్ర గాయాలయ్యాయి. అతనికి వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ సోమయ్య గారు అనంతసాగరం ఎస్సై ఎన్.ప్రభాకర్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.