ముస్తాబాద్/ఫున్నమి ప్రతినిధి/ జనవరి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని రద్దుచేసి జి రామ్ జి అనే పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందె ఇందులో జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం కేంద్రం నిధుల కొరత పెట్టడం రాష్ట్రాలపై భారాన్ని మోపడం లాంటి చర్యలు తీసుకున్నది ఈ నేపథ్యంలో ఏఐసీసీ మాన్రే గా బచావో సంగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు మరియు రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు హాజరయ్యారు కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి సీనియర్ నాయకులు కనమెని చక్రధర్ రెడ్డి మరియు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు


