అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గుత్తుల వారి పాలెం లో వర సిద్ధి వినాయకుడు కొలువుదీరాడు. చవితి నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. అర్చకుల వేద మంత్రాల నడుమ బాజా భజంత్రీలు, మేళ తాళాలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. వర్షం కురుస్తున్నా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.



