ఏర్పేడు, మార్చి 20, పున్నమి న్యూస్: కాంట్రాక్ట్ పనులు చేయించుకుని సెంట్రింగ్ మేస్త్రీలకు పూర్తి చెల్లింపులు చేయకుండా వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లు జి. వెంకయ్య, సిహెచ్. అంకయ్యలు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రీలను తీసుకువచ్చి పని చేయించుకున్నప్పటికీ, వారికి పూర్తిగా చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. సుమారు రూ.15 లక్షల పనికి కేవలం రూ.9 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.6 లక్షలు ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. బయటి జిల్లాకు చెందినవారనే కారణంతో మేస్త్రీలను భయపెట్టి, దౌర్జన్యంగా ప్రవర్తించడం అన్యాయమని విమర్శించారు. అంతేకాకుండా, పని కోసం ఉపయోగించిన మెటీరియల్స్ కూడా తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. పేద కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు.

కూలీల బకాయిలను వెంటనే చెల్లించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలీ-ఏఐటీయూసీ
ఏర్పేడు, మార్చి 20, పున్నమి న్యూస్: కాంట్రాక్ట్ పనులు చేయించుకుని సెంట్రింగ్ మేస్త్రీలకు పూర్తి చెల్లింపులు చేయకుండా వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లు జి. వెంకయ్య, సిహెచ్. అంకయ్యలు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రీలను తీసుకువచ్చి పని చేయించుకున్నప్పటికీ, వారికి పూర్తిగా చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. సుమారు రూ.15 లక్షల పనికి కేవలం రూ.9 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.6 లక్షలు ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. బయటి జిల్లాకు చెందినవారనే కారణంతో మేస్త్రీలను భయపెట్టి, దౌర్జన్యంగా ప్రవర్తించడం అన్యాయమని విమర్శించారు. అంతేకాకుండా, పని కోసం ఉపయోగించిన మెటీరియల్స్ కూడా తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. పేద కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు.

