కూనవరం పంచాయతీ నిధులు దుర్వినియోగాన్ని త్వరగా బయటపెట్టి ఆ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెరపాటి రవీంద్ర చింతూరు ఐటీడీఏ పీవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది.అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగిందని అంత స్పష్టంగా కనిపిస్తున్న వారిపై విచారణ పేరుతో కాలయాపన చేయడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకాలం ఉప సర్పంచ్ని సర్పంచ్ గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టకుండా సర్పంచ్ గా ఎలా కొనసాగించారని, వెంటనే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పూర్తి సమాచారం కావాలని ఆ చట్టం ద్వారా అధికారులను కోరడమైనది. ఈ విచారణలో విచారణ అధికారులపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఐటీడిఏ పి ఓ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో త్వరగా ఎంక్వయిరీ చేయించి అవినీతిపై సమగ్ర విచారణ జరిస్తున్నానని, వారు నిజంగా అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చేసిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

కూనవరం పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని త్వరగా బయట పెట్టండి
కూనవరం పంచాయతీ నిధులు దుర్వినియోగాన్ని త్వరగా బయటపెట్టి ఆ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెరపాటి రవీంద్ర చింతూరు ఐటీడీఏ పీవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది.అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగిందని అంత స్పష్టంగా కనిపిస్తున్న వారిపై విచారణ పేరుతో కాలయాపన చేయడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకాలం ఉప సర్పంచ్ని సర్పంచ్ గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టకుండా సర్పంచ్ గా ఎలా కొనసాగించారని, వెంటనే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పూర్తి సమాచారం కావాలని ఆ చట్టం ద్వారా అధికారులను కోరడమైనది. ఈ విచారణలో విచారణ అధికారులపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఐటీడిఏ పి ఓ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో త్వరగా ఎంక్వయిరీ చేయించి అవినీతిపై సమగ్ర విచారణ జరిస్తున్నానని, వారు నిజంగా అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చేసిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

