కూతురు చేతులారా తల్లి హత్య – కుత్బుల్లాపూర్‌లో దారుణం!

0
15

కూతురు చేతులారా తల్లి హత్య – కుత్బుల్లాపూర్‌లో దారుణం!

హైదరాబాద్, కుత్బుల్లాపూర్:

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కదిలించింది.

NLB నగర్‌లో నివాసముండే సట్ల అంజలి (వయస్సు 39) అనే మహిళను ఆమె సొంత కూతురు తేజశ్రీ (16) హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న తేజశ్రీ, తన ప్రేమ వ్యవహారం గురించి తల్లి మందలించిందన్న కోపంతో ఈ క్రూరమైన చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

తేజశ్రీ తన ప్రియుడు పగిల్ల శివ (19) మరియు అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ (18) సహాయంతో తల్లిని మొదట గొంతు నులిమి, అనంతరం తలపై బలంగా కొట్టి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

📌 పోలీసుల చర్య:

ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. బాలిక వయసు 16 కావడంతో జువైనైల్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.

👉 ప్రేమలో బలమైన భావోద్వేగాలు ఎంతటి ప్రమాదకర నిర్ణయాలకు దారి తీస్తాయో ఈ ఘటన దృష్టాంతంగా మారింది.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here