కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలు రక్షణ లేకుండా పోయిందని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ నుంచి కూటమి పార్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన నాటి నుంచి ఎస్సీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని అన్నారు. గాడాల గ్రామం ప్రధాన కూడలిలో స్టేట్ హైవే పై నడిరోడ్డు మీద ఎస్సీ యువకుడిని స్తంభానికి కట్టి విచక్షణారహితంగా కొట్టడం వంటి సంఘటనలతో రాష్ట్రంలో ఎస్సీలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారొ అర్థమవుతుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురపూడి గ్రామంలో ఉన్న ఎస్సీ యువకులకు గాడాల గ్రామంలో ఉన్న కాపు యువకులకు మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో తాము అనుకున్న ఎస్సీ యువకుడు దొరకకపోవడంతో ఆ గ్రామానికి చెందిన ఎవరో ఒక ఎస్సీ యువకుడిని చంపి మొత్తం ఎస్సీ లందరికీ భయం కల్పించాలన్న దుర్మార్గమైన కుల పరమైన ద్వేషంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మధురపూడి గ్రామానికి చెందిన పాము శ్రీను ను దారి కాచి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై స్తంభానికి కట్టేసి ముఖంపై ఉమ్ము వేస్తూ ఇనుప రాడ్లతో ముక్కు వెంట నోటి వెంట రక్తం వచ్చేలా విపరీతంగా కొట్టారు. ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ వారికి కూడా భయపడకుండా తమ దాడిని కొనసాగించడంతో పోలీసులే భయపడి మరింత మంది పోలీసులను రక్షణ కోసం రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన తర్వాత ఒంటినిండా రక్తాలతో తీవ్రమైన గాయాలతో వచ్చినప్పటికీ కేవలం ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రిలో అడ్మిషన్ ఇవ్వకుండా బలవంతంగా బయటికి పంపి వేయడంతో రాత్రంతా నెత్తుటి గాయాలతో ఆసుపత్రి బయట చెట్టు కింద బాధితులు పడి ఉండవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధంగా ఎస్సీలపై కర్కసంగా వ్యవహరిస్తున అధికారులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీస్ స్టేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే కేసులు నమోదు చేసి వదిలిపెట్టకుండా నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి బాధితులకు ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా కోరుకొండ సిఐకి ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరిగే దాడులను ప్రతిఘటించాలన్నా, శాశ్వత పరిష్కారం కావాలన్నా అణగారిన వర్గాల ప్రజలంతా ఏకమై తమ ఐక్యత శక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, ఎస్సీ యువకుడిపై కులపరమైన దాడి దారుణం, తక్షణ చర్యల కై బర్రే ఆనంద్ కుమార్ డిమాండ్.
కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలు రక్షణ లేకుండా పోయిందని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ నుంచి కూటమి పార్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన నాటి నుంచి ఎస్సీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని అన్నారు. గాడాల గ్రామం ప్రధాన కూడలిలో స్టేట్ హైవే పై నడిరోడ్డు మీద ఎస్సీ యువకుడిని స్తంభానికి కట్టి విచక్షణారహితంగా కొట్టడం వంటి సంఘటనలతో రాష్ట్రంలో ఎస్సీలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారొ అర్థమవుతుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురపూడి గ్రామంలో ఉన్న ఎస్సీ యువకులకు గాడాల గ్రామంలో ఉన్న కాపు యువకులకు మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో తాము అనుకున్న ఎస్సీ యువకుడు దొరకకపోవడంతో ఆ గ్రామానికి చెందిన ఎవరో ఒక ఎస్సీ యువకుడిని చంపి మొత్తం ఎస్సీ లందరికీ భయం కల్పించాలన్న దుర్మార్గమైన కుల పరమైన ద్వేషంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మధురపూడి గ్రామానికి చెందిన పాము శ్రీను ను దారి కాచి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై స్తంభానికి కట్టేసి ముఖంపై ఉమ్ము వేస్తూ ఇనుప రాడ్లతో ముక్కు వెంట నోటి వెంట రక్తం వచ్చేలా విపరీతంగా కొట్టారు. ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ వారికి కూడా భయపడకుండా తమ దాడిని కొనసాగించడంతో పోలీసులే భయపడి మరింత మంది పోలీసులను రక్షణ కోసం రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన తర్వాత ఒంటినిండా రక్తాలతో తీవ్రమైన గాయాలతో వచ్చినప్పటికీ కేవలం ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రిలో అడ్మిషన్ ఇవ్వకుండా బలవంతంగా బయటికి పంపి వేయడంతో రాత్రంతా నెత్తుటి గాయాలతో ఆసుపత్రి బయట చెట్టు కింద బాధితులు పడి ఉండవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధంగా ఎస్సీలపై కర్కసంగా వ్యవహరిస్తున అధికారులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీస్ స్టేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే కేసులు నమోదు చేసి వదిలిపెట్టకుండా నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి బాధితులకు ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా కోరుకొండ సిఐకి ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరిగే దాడులను ప్రతిఘటించాలన్నా, శాశ్వత పరిష్కారం కావాలన్నా అణగారిన వర్గాల ప్రజలంతా ఏకమై తమ ఐక్యత శక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

