కుక్కల మృతదేహాల వెలికితీత యాచారం మండలం..
జంతు ప్రేమికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఎట్టకేలకు కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను గుర్తించారు
రంగారెడ్డి జిల్లా యాచారం: జంతు ప్రేమికుల ఫిర్యాదుతో కేసు
నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన రెండు రోజులగా తీవ్ర చర్చలకు దారి తీయగా సంచలనంగా మారింది. యాచారం మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ వద్ద కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను పాతిపెట్టారన్న అనుమానంతో ఎస్సై మధు, ఆధ్వర్యంలో జెసిబితో పాతిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలంలోనే పదుల సంఖ్యలో బయటపడుతున్న కుక్కల మృతదేహాలను బయటకు తీసి వెటర్నర్ డాక్టర్లు, చనిపోయిన కుక్కలకు పోస్ట్ మార్టం చేశారు. గత కొంతకాలంగా పశువులు, మేకలు, వృద్ధులు చిన్న పిల్లలపై వీధి కుక్కలు కోతులు దాడులకు తెగబడుతున్నాయని గ్రామంలోని కుక్కలు కోతలను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.



