కుండపోత వర్షం.. రవాణాకు అంతరాయం….సహాయ చర్యలు చేపట్టిన బండారు మల్లికార్జున
రైల్వే కోడూరు మండలం అక్టోబర్, 22 ( ఈరోజు పత్రిక ప్రతినిధి ):
గత మూడు రోజులగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా రైల్వే కోడూరు మండలం, అనంతరాజుపేట గ్రామం, బి సీ కాలనీ నుండి అరుంధతి వాడకు పోవు దారిలో చెట్టు పడిపోవడం వలన గ్రామ ప్రజలకు ఏర్పడిన అంతరాయం వలన, గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకున్న ఎంపీటీసీ బండారు మల్లికార్జున వెంటనే అక్కడికి చేరుకొని చెట్లను స్వయంగా తొలగించారు. సమస్యను పరిష్కరించిన బండారు మల్లికార్జున కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు హర్షం వెలుబుచ్చారు.


