
దేవరాపల్లి గర్సింగి పంచాయతీ కించు మండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని పి జి ఆర్ ఎస్ లో గిరిజనులు వినతి.పత్రం సమర్పించారు,విరిగి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర పాల్గోని మాట్లాడారు,తర తరాలుగా గిరిజనులు కించుమండ గ్రామంలో జీవ స్తున్నారని తెలిపారు ప్రభుత్వ వీరిని గుర్తించి మంచి నీళ్ళు కరంటు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేసిందని పేర్కొన్నారు వీరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేక సార్లు అందోన చేసి అధికారులు ద్రుష్టికి తీసుకు వెళ్లిన ప్రభుత్వ పెడచేవిన పెడుతుందని తెలిపారు చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సౌకర్యం లేక బందువులు పడుతూ ఇంటి దగ్గర చదివించు కోవలసిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు ముసలి వారు గర్భిణీ స్ర్తిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గర్సింగి స్ర్తిలకు డోలి కట్టి మోసుకు రావడం తప్పడం లెదన్నారు,ఆదివాసిలు బాహ్య ప్రపంచానికి ఆమడ దూరంలో మగ్గి పోతున్నారని తెలిపారు ఈసంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటంతో అనా రోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పది కుటంంబాలు ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటల్లో అర్థం లెదన్నారు ఇప్పటి కైనా గిరిజనులు కష్టాలను అర్దం చేసుకోని వెంటనే ప్రభుత్వ రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో చెరుకు రాజు, కంచర గంగరాజు, కంచరి శ్రీను, గంగరాజు, కాగలదేముడు, రాంకుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

