కామారెడ్డి, 12 డిసెంబర్: పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం బౌలాష్టమి ఉత్సవం సందర్భంగా ఆకట్టుకునే పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం 5:30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహం స్వామివారిని దర్శించుకుని, భక్తి భావంతో హోమం, అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు.భక్తులు భారీ సంఖ్యలో ఉండటం తో దేవస్థానం వాతావరణం ఉల్లాసంగా మారింది. మంత్రి ప్రత్యేక సేవలు, స్వామివారికి చేసిన పూజల నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస్అ శ్రీనివాస్ శర్మ వేద మంత్ర ఉత్సవాలతో ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశా రు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ ఘన ఉత్సవం స్థానికుల్లో ఆనందాన్ని కలిగించందని తెలిపారు.


