*కార్యకర్తలకు బీమా పత్రాలు అందజేసిన గంటా*
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-, పద్మనాభం మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ తరపున బీమా పత్రాలు అందించారు. ఈమేరకు మంజూరైన రూ.15 లక్షల పత్రాలను మంగళవారం ఎం.వి.పి. కాలనీలోని క్యాంప్ ఆఫీస్ లో అందజేశారు. ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి, వేములవలసకు చెందిన గెడ్డం సావిత్రి, పద్మనాభం మండలం బాందేవపురం గ్రామానికి చెందిన పొట్నూరు పైడిరాజు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. ప్రపంచంలోనే కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, గండ్రెడ్డి రమేష్, సాగి కృష్ణమూర్తి రాజు, కాళ్ల సత్యనారాయణ, బంగారు నాయుడు, అప్పలనాయుడు, అంగటి రాము, బమ్మిడి తారక్ తదితరులు పాల్గొన్నారు.


